ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్ మిల్లు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సాపూర్ సీఐ జాన్వెస్లీ తెలిపారు.
నర్సాపూర్, : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్ మిల్లు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నర్సాపూర్ సీఐ జాన్వెస్లీ తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలోని వీరభద్ర ఇండస్ట్రీస్, మహాలక్ష్మీ రైస్ మిల్లుల యజమాని నోముల పాండురంగం రూ.44.56 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ధాన్యాన్ని మరాడించి సీఎంఆర్ కింద బియ్యం తిరిగి ఇవ్వలేదన్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ హరికృష్ణ ఫిర్యాదు మేరకు పాండురంగంపై మోసం, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసునమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




