రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో నాలుగు బ్రాందీ షాపులను లూటీ చేశారు మందుబాబులు. దాడి చేసి బాటిల్లను ఎత్తుకెళ్లారు. సుమారు 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొంతమంది మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను నిలదీశారు. దీంతో షాప్ యజమానులకు మందుబాబులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానలా మారి షాపులను లూటీ చేసే స్థితికి చేరింది. అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకొని వెళ్ళారు.
ఇదే అవకాశంగా అనుకుని అటుగా వెళ్ళే మహిళలు కూడా షాపులో ఉన్న మద్యం బాటిల్స్ను ఎత్తుకెళ్లారు. అయితే మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ఒక నేత ఆధీనంలో ఈ వైన్ షాపు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను ఇతర మద్యం వ్యాపారులతో కలిసి సిండికేట్గా మారి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ లోపు చాలా మంది మద్యం బాటిళ్లను బాక్సుల్లో ఎత్తుకెళ్లారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





