కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
కర్నూలు జిల్లా, జూన్ 25: కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోయజు కొంతకాలంగా కర్నూలులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తన స్నేహితురాలు (గర్ల్ఫ్రెండ్) ఫోన్లో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల వాంగ్మూలాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డుల ఆధారంగా మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




