సేలం, : నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్ లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యంలో నీట్ రద్దు కావడంతో ఈ నెల 21న జరగనున్న పునఃపరీక్షకు సిద్ధమవుతోంది. సరిగా రాయలేనని భయాందోళనకు లోనైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొంగణాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే 20వ పుట్టినరోజు జరుపుకొన్న గోపిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Also read
- ముగ్గురు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
- గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- ‘మా అల్లుడు సైకో’.. టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు
- నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణం
- కన్నబిడ్డలతో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య





