మైలవరం: మైలవరం మండలం వేపరాల గ్రామం సమీపంలోని పెన్నా నదిలో స్నానానికి వెళ్లిన అత్త, అల్లుడు నీటిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… తొర్రివేముల గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు సరదాగా స్నానం చేయడం కోసం పెన్నా నదికి వెళ్లారు. అయితే, నీటి లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కళ్యాణ్ కుమార్ (25), అతని అత్త వరుస అయిన వెంగమ్మ (45) నీటిలో మునిగిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా మొదట కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. వెంగమ్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఊహించని ప్రమాదంతో తొర్రివేముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





