తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని నెయ్యి గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాము లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగి సరకు మొత్తం కాలిపోయింది.
ప్రస్తుతం గోదాములో కొంతకాలంగా అల్లం, వెల్లుల్లిపాయలు నిల్వచేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో గోదాములోని సరకుతో పాటు కారు కూడా దగ్ధమైంది. నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యజమాని అందుబాటులో లేకపోవడం వల్ల ఎంత నష్టం అనేది చెప్పలేమని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
Also read
- నెయ్యి గోదాములో భారీ అగ్ని ప్రమాదం
- సహజీవనం తీసింది ప్రాణం.. అనాథలైన నలుగురు పిల్లలు
- కుమారుడి కళ్లెదుటే కిరాతకం.. భార్యను హత్య చేసిన భర్త
- ఇన్వర్టర్ నుంచి విద్యుత్తు సరఫరా..స్తంభంపైనే ప్రాణాలొదిలిన కార్మికుడు
- మృగశిర కార్తె అయితే.. చేపలు కొనుక్కోవాలి.. లూటీ చేయకూడదు.. చెరువు మీద పడి నిమిషాల్లోనే..





