SGSTV NEWS online
Andhra PradeshCrime

కేసరపల్లి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య





కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) హాస్టల్ గదిలో మృతి చెందగా, ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

కృష్ణా జిల్లా: గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు క్యాంపస్‌కు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి బంధువులను పోలీసులు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also read

Related posts