మామిడికుదురు: అనారోగ్యంతోబాధపడుతున్న తల్లికి మందులు తీసుకు వచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై కుమారుడు మృతి చెందాడు. మొగలికుదురులో మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇవీ.. గెద్దాడకు చెందిన గుబ్బల మనోహర్ (22) విజయవాడలో ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడు.
తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో సోమవా రం రాత్రి స్వగ్రామం వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమెకు మందులు తీసుకు వచ్చేందుకు బైక్పై వెళుతుండగా మొగలికుదురు ప్రధాన రోడ్డుపై వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ మోటార్ సైకిల్ సడన్ గా మలుపు తిరిగి మనోహర్ బైకును ఢీకొంది.
ఈ ఘటనలో రోడ్డుపై పడి గాయపడిన మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి బాల శ్రీను ఫిర్యాదుపై నగరం ఎస్ఐ ఎ. చైతన్యకుమార్ కేసు నమోదు చేశా రు. మృతుడు అవివాహితుడు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also read
- ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
- Astrology Tips: మీ తలపై బల్లి పడిందా?.. ఆ పెద్ద మార్పుకు టైమ్ దగ్గరపడినట్టే!
- ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోషం తప్పదట!
- పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
- ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..





