రెండు రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు..
ఈరోజు అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రోత మాటలు మాట్లాడారు..
దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..
అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు..
దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు..
మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ కూడా పలువురు జర్నలిస్టు నిలదీసినట్లు సమాచారం….
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




