రెండు రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు..
ఈరోజు అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రోత మాటలు మాట్లాడారు..
దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..
అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు..
దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు..
మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ కూడా పలువురు జర్నలిస్టు నిలదీసినట్లు సమాచారం….
Also read
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి
- 100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!
- పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, వివాహ యోగం ఖాయం!





