అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఐదుగురు మహిళల బృందం మెడలో ఐడీ కార్డులు ధరించి పలు షాపులలో అచ్చం సేఫ్టీ అధికారుల మాదిరే కటింగ్ ఇస్తూ.. అది సరిగా లేదు.. ఇది సరిగా లేదు.. అంటూ హంగామా చేస్తూ అన్ని షాపులకు ఫైన్లు వేశారు. ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు పేరుతో రసీదులు కూడా ఇచ్చారు. ఇలా పదుల సంఖ్యలో షాపులు తనిఖీ చేసి డబ్బులు వసూలు చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల అతి ప్రవర్తన అనుమానం వచ్చి స్థానికులు ప్రశ్నించడంతో.. తమ పై అధికారులతో మాట్లాడాలంటూ ఫోన్ చేశారు. స్థానికంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు తెలుసని చెప్పడంతో ముఖానికి మాస్క్ కట్టుకొని.. వచ్చిన ఆటోలోనే కళ్యాణదుర్గం వైపు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులను షాపు యజమానులు విచారించగా అలాంటి మహిళా బృందం ఎవరు తమ వద్ద లేరని, వారంతా నకిలీ అధికారులని చెప్పడంతో షాప్ యజమానులకు మహిళలు తమను బురిడీ కొట్టించారన్న విషయం అర్థమైంది.
నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులపై అనంతపురం జిల్లా ఫుడ్ సే ఫ్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించడంతో షాపు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఎటువంటి బెరుకు లేకుండా అన్ని షాపులు తనిఖీ చేసి ఇలా డబ్బులు దండుకోవడం బెడుగుప్పలో చర్చనీయాంశంగా మారింది.
Also read
- సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్డేట్!
- మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
- పాపం ఏం కష్టమొచ్చిందో..! అందరూ చూస్తుండగానే గోదావరి నదిలోకి దూకిన మహిళ!
- భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణ పరిహారం ప్రకటించాలి ….గ్రీష్మ కుమార్,
- అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!





