భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి రూ.70 వేలు లంచం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. గురువారం లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేస్తున్నారు.
Also read
- ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?
- Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..
- Hyderabad: కామంతో రెచ్చిపోయాడు.. కట్చేస్తే.. ఊహించని ట్విస్ట్..
- అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి





