భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి రూ.70 వేలు లంచం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. గురువారం లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేస్తున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





