పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా, మే 5: పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. నందివాడకు చెందిన మురళీకృష్ణకు 13 ఏళ్ల క్రితం లక్ష్మీ ప్రసన్నతో పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా లక్ష్మీ ప్రసన్న 6 నెలల నుంచి దూరంగా ఉంటోంది. పామర్రులో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆదివారం భర్త మురళీ కృష్ణ, అతడి సోదరులు ఆమె దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవ చిలికి, చిలికి గాలి వానలా మారింది. లక్ష్మీ ప్రసన్నపై భర్త, అతడి సోదరులు ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిందని ధ్రువీకరించుకున్నాక నిందితులు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించింది.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..12 రాశులకు వారఫలాలు
- పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు వెలుగులోకి: రాధా గాయత్రి భర్త
- ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట మోసాలు.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు
- గన్ తో కాల్చుకొని సెక్యూరిటీ ఉద్యోగి మృతి.
- Golconda: గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..





