ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంను ఎత్తుకెళ్లారు.
తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు.
రాడ్లతో దానిని పెకిలించడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో గట్టిగా లాగారు. ఎటీఎంను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 21 జూన్, 2026
- Lotus Flower: దేవతల ఆసనంగా తామర పువ్వే ఎందుకు? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకర రహస్యం
- గరుడ పురాణం: ఈ 7 మహాపాపాలు చేస్తే నరకంలో దారుణమైన శిక్షలు తప్పవు
- తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
- Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?





