విజయవాడలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసిపాపను ఓ కిరాతకుడు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఓ మహిళకు, విజయవాడకు చెందిన వంశీ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రియుడితో గొడవ జరుగుతుండగా, కోపంతో ఊగిపోయిన వంశీ సదరు మహిళపై దాడి చేశాడు. అంతేకాదు ఆమె ఒడిలోని 18 నెలల కుమార్తెను అత్యంత క్రూరంగా గోడకేసి కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జరిగిన ఘోరాన్ని ఐదేళ్ల కుమారుడి ద్వారా తెలుసుకున్న తండ్రి, గన్నవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును విజయవాడకు బదిలీ చేశారు. ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





