తాండూరులో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు ప్రేమను చెడగొట్టాలని ఒక తల్లి మంత్రగాడితో కలిసి క్షుద్ర పూజలు చేయించింది. కాలనీవాసులు మంత్రగాడిని పట్టుకుని దేహాశుద్ధి చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అంటారు. కానీ, అదే ప్రేమ ఒక కన్నతల్లిని కసాయిగా మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురు మనసు మార్చుకోవాలని, ఆమె ప్రేమ పేటాకులు కావాలని ఓ తల్లి ఏకంగా క్షుద్రపూజల దారి పట్టడం వికారాబాద్ జిల్లా తాండూరులో తీవ్ర కలకలం రేపింది. నమ్మలేని నిజం ఏమిటంటే, తన బిడ్డ బాగుండాలని కోరుకోవాల్సిన తల్లే, మంత్రగాడితో కలిసి సొంత కూతురిపైనే చేతబడి చేయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిరా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే కూతురు ప్రేమ పేటాకులు కావాలని తల్లి సాయమ్మ తాండూరు పట్టణానికి చెందిన మంత్రగాడిని సంప్రదించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తెల్లవారుజామున పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేస్తుండగా చూసిన కాలనీవాసులు ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. విషయాన్ని అర్థం చేసుకుని కాలనీవాసులు కొందరు మంత్రగాడికి దేహాశుద్ధి చేశారు. ఈ విషయం కాలనీవాసుల జోక్యంతో తాండూరు పట్టణ పోలీసుస్టేషన్కు చేరింది. తీవ్ర కలకలం రేగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశం మారింది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





