నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలాజీ మృతిచెందగా.. వృద్ధురాలు లక్ష్మికి తీవ్రగాయాలయ్యా ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. నందివాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సిమెంట్ రాళ్లతో ఇరువురినీ బలంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు, వృద్ధురాలిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





