Kakinada Crime: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జరిగింది. గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసముంటున్నారు. బర్రెకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నబుల్లి తనకు ఉన్న మూడెకరాల తోటలో తన కూతురు కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని గామస్తులు తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వాపోయారు.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





