Kakinada Crime: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జరిగింది. గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసముంటున్నారు. బర్రెకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నబుల్లి తనకు ఉన్న మూడెకరాల తోటలో తన కూతురు కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని గామస్తులు తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వాపోయారు.
Also read
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..
- వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు
- కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత
- రేణుకను పక్కా ప్లాన్తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం




