Crime News: మియాపూర్లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్లో హౌస్కిపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గతంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.
నూకరత్నంకు తీవ్ర గాయాలు
అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్ను పెళ్లి చేసుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు ఆలీషా, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..
- వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు
- కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత
- రేణుకను పక్కా ప్లాన్తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం




