గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామునే ఈదుల పాలెం చెరువులో పురుషుడి మృతదేహం కనిపించింది. స్థానికులు శవాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గుంటూరులోని మార్చురీకి తరలించారు. అయితే మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసినట్లు, మృతుడి వంటిపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్య చేసి శవం తేలకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాయి కట్టి చెరువులో పడేసినట్లు భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పొన్నూరు పట్టణానికి చెందిన తన్నీరు వెంకటేశ్వరావుకు గుంటూరు సమీపంలోని దాసరి పాలెంకు చెందిన తిరుపతమ్మతో వివాహం అయింది. ఆరేళ్ల కిందట వివాహమైన వీరికి ఒక పాప ఉంది. అయితే కొద్దీ కాలంగా మద్యానికి బానిసైన వెంకటేశ్వరావు భార్యాపిల్లలను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని భార్య తన పుట్టింటికి వెల్లిపోయింది. దీంతో పంచాయతీ పెట్టి ఇరు వర్గాలు సర్ధిచెప్పడంతో అమె మరోసారి భర్త వద్దకు వెళ్లింది. అయినా భర్త తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.. మళ్లీ భాను వేధించడం స్టార్ట్ చేశాడు.
ఇక భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో గ్రామం నుండి వెంకటేశ్వరావు ఇంటికి వెళ్లిన బంధువులు అతన్ని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరావుతో మాటామాట పెరిగింది. అతనిపై దాడి చేశారు. దాడి చేస్తున్న సమయంలోనే వెంకటేశ్వరావు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. వెంకటేశ్వరావు చనిపోయిన విషయాన్ని గుర్తించిన తిరుపతమ్మ అతని బంధువులు విషయం బయటపడుతుందన్న భయంతో వెంటనే అతన్ని మృతదేహాన్ని ఈదులపాలెం వద్దకు తీసుకొచ్చి రాయి కట్టి చెరువులో పడేశారు.
ఇక వేకటేశ్వరరావు కనిపించక పోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని పరిగణలోకి తీసుకన్న పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంలో అన్ని విషయాలు చెప్పింది. దీంతో దాడి చేసిన వారితో పాటు భార్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వరావును హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Also read
- మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు చెప్పేది ఏమిటి!
- నేటి జాతకములు…22 మార్చి, 2026
- Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్! వెలుగులోకి..
- Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా
- పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!





