Suicide case: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో తండ్రి దినకర్మ జరిగిన రోజే తనయుడు భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా వృత్తిని కొనసాగిస్తున్న భాస్కర్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల భాస్కర్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, ఆ బాధ నుంచి కుటుంబం ఇంకా కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడటంతో ఆటో డ్రైవర్ భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తండ్రి దినకర్మ కార్యక్రమాలు ముగియగానే భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కూడా కలిచివేసింది.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





