చింతలపూడి: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరుజిల్లా చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది.
అదే గ్రామానికి చెందిన రాముడు (53) es బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





