SGSTV NEWS online
Andhra PradeshCrime

గురుకులంలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. 8వ తరగతి బాలుడిపై సీనియర్ విద్యార్థుల లైంగిక దాడి..!


కర్నూలు జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 8వ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడిని కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరా గురుకులం కళాశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి తెగబడ్డారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొనసాగుతోంది. రోజుల తరబడి లైంగిక దాడి భరించలేక బాధిత విద్యార్థి కళాశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 20) రాత్రి మరోమారు విద్యార్థిపై సీనియర్లు లైగింక దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆలూరు ఆసుపత్రికి తరలించి రహస్యంగా తరలించిన గురుకుల పాఠశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts