శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన.
చిల్లకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు. పోలీసుల వివరాల మేరకు.. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లి గ్రామానికి చెందిన ఏడెం రమణారెడ్డి(84) పశువులను మేపుకొచ్చేందుకు రోజూ మాదిరిగానే ఓడూరు పరిధిలోని పొలాల్లోకి శుక్రవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పశువులు మాత్రమే ఇంటికి వచ్చాయి. రమణారెడ్డి రాకపోవడంతో పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం జామాయిల్ తోటలో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయం ఉండడం,చేతిలోని నాలుగు గ్రాముల బంగారు ఉంగరం మాయం కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి బంగారం దొంగిలించినట్లు ప్రాథమికంగా వారు అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
Also read
- అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
- రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!
- కన్నతల్లి దారుణం- కొడుకు ఆరోగ్యం కోసం కూతురు నరబలి- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
- నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?




