SGSTV NEWS online
Andhra PradeshCrime

కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి



కడప జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో..

బైక్ పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.

Also read

Related posts