గుళ్లు, గోపురాల్లోనే కాదు పంట పొలాల్లో కూడా గుప్త నిధుల కోసం వేటగాళ్లు తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.. ఓ పొలంలో పురాతన నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం ఉన్న ప్రాంతం గతంలో సాధారణ భూమిగా ఉండేది… కాలక్రమంలో దాన్ని పొలంగా మార్చి పంటలు వేసుకుంటున్నారు… పురాతన నంది విగ్రహాన్ని తొలగించడం ఇష్టం లేక అలాగే ఉంచేశారు. అయితే ఈ నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి గుంతను తవ్వి నిధుల కోసం వెతికారు. ఉదయం పొలానికి వెళ్లిన రైతు నంది విగ్రహం పెకలించి వేసి.. గుంత తవ్వి ఉండటాన్ని గమనించడంతో గుప్త నిధుల వేటగాళ్ల నిర్వాకం బయటపడింది.
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కంభం చెరువుకు వెళ్లే దారిలో ఓ పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు సమాచారం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహం కలిగిన రాయిని తొలగించి, దాని కింద తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పురాతన విగ్రహాన్ని కదిలించడం, అనుమానాస్పదంగా తవ్వకాలు జరగడం వెనుక గుప్తనిధుల ఆశే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కంభం పోలీసులను వివరణ కోరగా ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు అందితే విచారణ చేపట్టి, దుండగులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Also read
- మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే..
- మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
- కుక్క కరవగానే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ వేయించారు.. కానీ కొన్ని రోజుల తర్వాత..
- అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
- Mangalagiri: లా చదివి ఇదేం పనిరా రాస్కెల్.. ఏకంగా 11 రాష్ట్రాల్లో..





