నెల్లూరు : వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులోని వేదాయపాలెం పోలీసులు ఆదివారం రాత్రి నగరంలో రోడ్డుపై నడిపించారు. పోలీసుల కథనం మేరకు.. స్టేషన్ పరిధిలోని అంబాపురం యల్లమ్మగుడి సమీపంలో నివాసం ఉంటున్న మనిదేవి అలియాస్ దేవపై ఈ నెల 16న రాత్రి రౌడీషీటర్లు రవి అలియాస్ ఏక్బాల్, కృష్ణసాయి అలియాస్ కిట్టులతో పాటు వాసు, హుస్సేన్, మరో ఐదుగురు బాలురు హత్యాయత్నం చేశారు. వాహనాన్ని పక్కకు తీయనందుకు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై దేవ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగర డీఎస్పీ దీక్ష పర్యవేక్షణలో గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ సెంటరు వరకు నలుగురు నిందితులను రోడ్డుపై నడిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
Also Read
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా
- ప్లాట్ ఫారం రిక్షా కార్మికులకు “” రిక్షా స్టాండ్”” ఏర్పాటు చెయ్యాలని మంత్రి గారికి వినతిపత్రం…..ఐ.యఫ్.టి.యు.
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!





