ఖమ్మం: ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు సమాచారం అందించగా ఖమ్మం ఒకటో పట్టణ ఎస్సై మౌలానా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతురాలిని భద్రాచలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తించారు. పిల్లలు పుట్టలేదని కొన్నేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ప్రమీలను కొద్దినెలలుగా భర్త స్నేహితుడు శ్రావణ్ వేధిస్తున్నాడు. నెల క్రితం.. భద్రాచలంలో అతడిపై ప్రమీల కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. తనకు సహకరించకపోగా కేసు పెట్టినందుకు ఆమెను శ్రావణ్ కత్తితో పొడిచి చంపి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





