రాయదుర్గం, : సెలవులు ముగిశాయి.. బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని ఓ బాలుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె.బాలరాజు కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్ల మండం, అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఓ కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలో నివాసం ఉంటోంది. కుటుంబ పెద్ద వాచ్మన్గా పనిచేస్తోండగా.. ఆయన కుమారుడు (14) చందానగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా క్రిస్మస్ సెలవులు ముగిసినా బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు సోమవారం నుంచి బడికి వెళ్లేందుకు బ్యాగు సర్దుకుని సిద్ధం కావాలని కుమారుడికి చెప్పారు. ఈ క్రమంలో తల్లి ఇంటి బయట పనిలో నిమగ్నమవగా బాలుడు లోపల ఇంట్లోని రేకుల పైకప్పు రాడ్డునకు ఉరివేసుకున్నాడు. కాసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





