నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం మత్తులో కుమార్తెపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ వార్డులో నివాసం ఉంటున్న నరేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యను గల్ఫ్కు పంపించిన నరేష్ రోజువారి పనులకు వెళ్లేవాడు. మద్యం మత్తులో తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె (13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో బాధితురాలితో పాటు విషయం తెలిసిన ఆమె అక్క సైతం భయపడి ఎవరికీ చెప్పలేదు. ఇదే అలుసుగా తీసుకున్న నిందితుడు ప్రతిసారీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాధితురాలి తల్లి గల్ఫ్ నుంచి రావడంతో కుమార్తెలిద్దరూ తండ్రి నిర్వాహకాన్ని చెప్పి భోరుమన్నారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





