చోరీకి వచ్చిన దొంగను ఓ ఒంటరి వృద్ధురాలు తెలివిగా బురిడీ కొట్టించింది. ఇంట్లో ఉన్న అసలు బంగారు నగలను భద్రంగా దాచిపెట్టి, బయటకు మాత్రం రోల్డ్ గోల్డ్ నగలను ధరించి దొంగకు మస్కా కొట్టింది. వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దొంగ, ఆమె మెడలో మెరిసిన నగలను చూసి బంగారమని భావించి అపహరించాడు. అయితే దొంగిలించిన తర్వాత అవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసి దొంగ షాక్ తిన్నాడు. అంతేకాదు బంగారు నగలను కాపాడుకున్న వృద్ధురాలి తెలివికి పోలీసులు ఫిదా అయ్యారు.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మహిళలు నగలు ధరించి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మమ్మ ఒంటరిగా ఉంటోంది. వేసవి కావడంతో రోజు ఆరుబయట నిద్రిస్తోంది. లక్ష్మమ్మ తనకున్న నగలను ధరించింది. ఇదే గ్రామానికి చెందిన గోలి రాజశేఖర్.. వృద్ధురాలు లక్ష్మమ్మ మెడలోని బంగారు గొలుసుపై కన్ను పడింది. దీంతో మే నెల 27వ తేదీన ఆమె కళ్లల్లో కారం చల్లి మెడలో ఉన్న గొలుసును చోరీ చేశాడు. మరుసటి రోజే గమనించిన బాధితురాలు లక్ష్మమ్మ.. మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన రాజశేఖర్ బాధితురాలు ఒంటిపై ఉన్న బంగారు గొలుసులో దొంగలించాడని నిర్ధారించారు. గొలుసును చోరీ చేసిన రాజశేఖర్ అక్కడే ఒక చెట్టు మొదట్లో దాచినట్లు ఒప్పుకున్నాడు. తీరా పోలీసులు వెళ్లి చూస్తే అది నకిలీ గొలుసు అని తేలింది. కానీ లక్ష్మమ్మ అది తనదేనని, అసలు బంగారు గొలుసును ఇంట్లో భద్రంగా దాచిపెట్టి, నకిలీది వేసుకొని పడుకున్నట్లు చెప్పటంతో దొంగ షాక్ తిన్నాడు. అంతేకాదు తన నగలను కాపాడుకునేందుకు వృద్ధురాలు చేసిన తెలివికి పోలీసులు ఫిదా అయ్యారు.
ఏది ఏమైనా చోరీ చేయడం నేరంగా భావించిన పోలీసులు రాజశేఖర్ అరెస్టు చేశారు. వృద్ధురాలి చాకచక్యానికి పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా, “దొంగను దొంగతనంతోనే మోసం చేసింది” అంటూ జనం మెచ్చుకుంటున్నారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




