రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyd crime: అది 2019 నవంబర్.. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర 26 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం దారుణంగా హత్య చేశారు! అత్యాచారం చేసిన తరువాత యువతి మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లి ఒక బ్రిడ్జి కింద పడేసి తగలబెట్టారు. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది! అయితే సరిగ్గా ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న యువతిగా గుర్తించారు.మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూ టీమ్ సహాయం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





