అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని టి. వీరాపురం తీవ్ర విషాదం వెలుగు చూసింది. గ్రామ సమీపంలోని దొణగంగమ్మ గుడి వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఉదయం ఇంటి నుంచి తోటకు వెళ్లిన వీరు సాయంత్రానికి నీటి కుంటలో శవాలై తేలారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్నేహితుల దినోత్సవం రోజు పెను విషాదం వెలుగు చూసింది. టి. వీరాపురం గ్రామ సమీపంలో దొణగంగమ్మ గుడి వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తోటకు వెళ్లిన వీరు సాయంత్రానికి నీటి కుంటలో శవాలై తేలారు. రాత్రి 7 గంటలకు వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతి చెందిన శ్వేత (11) మౌనిక (9) ఇద్దరు పక్క పక్క ఇంటిలో ఉండే ప్రాణస్నేహితులు కావడం విశేషం. స్నేహితుల దినోత్సవం నాడే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు మృత్యువు ఒడిలో చేరారు.
వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న శ్వేత కాఫీ తాగాలనిపించి గ్యాస్ స్టవ్ మీద కాఫీ పెట్టుకుంది. ఈ క్రమంలో కాఫీ పెట్టిన గిన్నే కాస్త మాడిపోయి నల్లగా మసిపారిపోయింది. దీంతో తల్లిదండ్రులు వచ్చి చూస్తే తిడతారని భయపడిపోయిన శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేముందు శ్వేత తన చెల్లితో తాను దోనగంగమ్మ కుంటలోపడి చనిపోతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా వెళ్లే క్రమంలోనే తనకు తోడుగా తన స్నేహితురాలైన మౌనికను కూడా శ్వేత వెంటపెట్టుకొని తీసుకెళ్లిందని.. ఆమె చెల్లి కుటుంబ సభ్యులకు తెలిపినట్టు తెలుస్తోంది.
ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో హుటాహుటిన దోనగంగమ్మ కుంటకు చేరుకున్నారు. కుంటలో దూకి బాలికల ఆచూకీ కోసం వెతికగా నీటిలో ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!