దారుణం చోటుచేసుకుంది.. ముక్కుపచ్చలారని చిన్నారి ఉసురు తీసింది.. ఓ పెంపుడు కుక్క. ఒక్కసారిగా ఐదు నెలల పసివాడిపై దాడిచేసిన కుక్క.. పీక్కుతింది. ఒక్కసారిగా బాబుపై దాడి చేసి ముఖాన్ని కొరికి కొరికి చంపేసింది. ఈ దారుణం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. తాండూరు బసవేశ్వర్ నగర్లో నివసిస్తున్న దత్తు-లావణ్య దంపతులకు ఐదు నెలల బాబు ఉన్నాడు. వీళ్లు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుంది ఆ కుక్క చిన్నోడిపై విరుచుకుపడింది. ముఖంపై రక్తంకారేలా దారుణంగా కొరికేసింది. పెంపుడు కుక్క దాడిలో ఆ పసివాడు తల్లడిల్లాడు. ఇంతలో కేకలు విని తల్లిదండ్రులు హుటాహుటిన పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విగతజీవిగా మారిన పసివాడిని చూసి గుండెలుపలిగేలా రోదించారు తల్లిదండ్రులు.
ఇంటికి కాపలా ఉంటుందని పెంచుకున్న కుక్క.. చిన్నోడిని పొట్టనపెట్టుకోవడంతో బంధువులు, స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ శునకాన్ని కొట్టికొట్టి చంపేశారు.
తాము కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని కుక్క ప్రాణాలు తీయడంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





