అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి..
కేదార్నాథ్, జూన్ 15: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో ఆదివారం (జూన్ 15) ఉదయం హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గౌరికుండ్ – త్రిజుగి నారాయణ్ మధ్య హెలీకాప్టర్ కూలిపోయింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమని తెలుస్తుంది. కూలిపోయిన హెలికాఫ్టర్ను ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలీకాప్టర్గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి SDRF, NDRF బృందాలు బయలుదేరి వెళ్లాయి. డెహ్రాడూన్ నుంచి కేథార్ నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరికుండ్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, ఓ చిన్నారితో సహా ఐదుగురు మరణించినట్లు సమాచారం. కూలిపోయిన హెలికాప్టర్లో ఆరుగురు ఉన్నారు. ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ గమ్యస్థానాలలో ఒకటైన కేదార్నాథ్కు వెళ్లే యాత్రా మార్గానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. విమానంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారని ప్రాథమిక నివేదికలు నిర్ధారించాయి. అత్యవసర సేవలు, విపత్తు ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నాయి. హెలికాప్టర్ ఆపరేటింగ్ కంపెనీ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది చార్ ధామ్ యాత్ర సీజన్ కావడంతో ఎత్తైన ప్రదేశాలలో యాత్రికులను చేరవేసేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగిస్తుంటారు. తాజాగా హెలికాఫ్టర్ కూలడంతో యాత్రికుల భద్రత గురించిన ఆందోళనలను లేవనెత్తింది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





