Andhra Pradesh: మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా..
పగవాడికి కూడా వారికి వచ్చిన కష్టం రాకూడదు అంటారు. అలాంటి విషాద ఘటనే ఆ కుటుంబంలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే కొడుకు లేడన్న మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా ఆ కుటుబానికి వచ్చిన కష్టం రాకూడదని కన్నీరుమున్నీరయ్యారు.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన పోట్రు మణికంఠ (35) అనారోగ్యంతో గతరాత్రి ఇంటి దగ్గరే మృతి చెందాడు. మృతి చెందిన విషయాన్ని ఆయన తండ్రి పోట్రు హరిబాబు(55) తెలియజేశారు. కుమారుడి మరణవార్తని తట్టుకోలేక పోయిన తండ్రి హరిబాబు ఒక్కసారిగా తీవ్ర గుండె పోటుకి గురయ్యారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతూ తండ్రి కూడా కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే చనిపోయాడు. రెండు మృతదేహాలను ఒకేసారి మోసుకొని వెళుతున్న దృశ్యాన్ని చూసిన బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మాటల్లో చెప్పనలవి కావు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





