Andhra Pradesh: మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా..
పగవాడికి కూడా వారికి వచ్చిన కష్టం రాకూడదు అంటారు. అలాంటి విషాద ఘటనే ఆ కుటుంబంలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే కొడుకు లేడన్న మనస్థాపంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై తండ్రీ కూడా మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మృతదేహాల పాడెలను తీసుకెళుతుంటే ఆ దశ్యాలను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పగవాడికి కూడా ఆ కుటుబానికి వచ్చిన కష్టం రాకూడదని కన్నీరుమున్నీరయ్యారు.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన పోట్రు మణికంఠ (35) అనారోగ్యంతో గతరాత్రి ఇంటి దగ్గరే మృతి చెందాడు. మృతి చెందిన విషయాన్ని ఆయన తండ్రి పోట్రు హరిబాబు(55) తెలియజేశారు. కుమారుడి మరణవార్తని తట్టుకోలేక పోయిన తండ్రి హరిబాబు ఒక్కసారిగా తీవ్ర గుండె పోటుకి గురయ్యారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతూ తండ్రి కూడా కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే చనిపోయాడు. రెండు మృతదేహాలను ఒకేసారి మోసుకొని వెళుతున్న దృశ్యాన్ని చూసిన బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మాటల్లో చెప్పనలవి కావు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న