ఏపీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ ప్రమాదం నుంచి యువతి మాత్రమే బయటపడి.. యువకుడు గల్లంతు కావడంతో ఈ ఘటన మిస్టరీగా మిగిలింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించడం శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తు అక్కడే జీవనం సాగిస్తోంది. ఆ అమ్మాయికి దాసరిపాలెంకు చెందిన తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తేజ దాసరి పాలెంలోని ఓ ప్రవేటు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. అయితే తేజ కాలేజ్కు వెళ్లి వచ్చే సమయంలోనే.. ఆ అమ్మాయి కూడా స్పిన్నింగ్ మిల్లుకు వెళ్లి వస్తుండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలంగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. సోమవారం రాత్రి వీరిద్దరూ కలిసి చౌడవరం సమీపంలోని క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరిలో అమ్మాయి మాత్రమే తిరిగి వచ్చింది. యువకుడు తేజ మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదు. ఈ విషయం కాస్త పోలీసులకు దృష్టికి వెల్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వారీ గుంతల్లో తేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తేజ మిస్సింగ్పై పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. అయితే ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరం గుంతలోకి దూకామని..దానిని గమనించిన స్థానికులు తనను కాపాడారని ఆ యువతి చెబుతోంది. అయితే రాత్రి నుంచి ఎంత వెతికినా తేజ ఆచూకీ మాత్రం లభించట్లేదు. దీంతో రాత్రి అక్కడకు వీళ్లిద్దరే వెళ్లారా.. వీళ్లతో పాటు ఇంకెవరైనా వెళ్లారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదే కాకుండా ఇక్కడ అమ్మాయిని కాపాడిన వాళ్లు ఎవరూ అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను కాపాడిన వారు ఎవరని తెలిస్తే..తేజ ఆచూకి లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు
Also read
- సోమవారం శివలింగానికి ఇవి సమర్పిస్తే చాలు.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
- మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Andhra News: బియ్యం కావాలని షాప్కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్కట్ చేస్తే..
- సినిమా డైరెక్టర్లనే మించిపోయారు.. ఆ ప్లానింగ్స్ ఏంటి భయ్యా! భర్త మర్డర్కు ప్రియుడితో స్కెచ్.. సిన్ సీన్కు ట్విస్టే





