ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
70 సవర్ల బంగార ఆభరణాలు
ఈ మేరకు డోర్ లాక్ చేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ ఇందిరానగర్ జనతా పేట పలు ప్రాంతాలలో గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంట నాలుగు ఇళ్ల తాళాలు పగలగొట్టిలో చోరీ జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా 70 సవర్ల బంగార ఆభరణాలు 50వేల రూపాయలు నగదు కేజీ వెండి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు.
స్వయంగా డీఎస్పీ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని సిఐఎస్ఐ లతో కలిసి ఇల్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో కావలి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితులు తమ సొమ్ము ఇప్పించాలంటూ లబోదిబో అని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




