అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి మరణించింది. స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో దీప్తి మృతి చెందగా మరో యువతి గాయపడింది.
పై చదవుల కోసమై విదేశాలకు వెళ్లిన..కొందరు యువత విగతజీవులుగా ఇంటికి చేరుతున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పులు, కత్తుల దాడుల్లో కొందరు విద్యార్తులు చనిపోతుంటే..రోడ్డు ప్రమాదాల్లో మరి కొందరు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మరణించింది.
గుంటూరు జిల్లా రాజేంద్రనగర్కు చెందిన దీప్తి పై చదువుల కోసం కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లింది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేస్తోంది. అయితే ఈ నెల 12న తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి మరణించగా, మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంకో నెల రోజుల్లో దీప్తి కోర్సు పూర్తి కానుంది. కోర్సు పూర్తయ్యాకు దీప్తి ఇండియాకు వద్దామనుకున్నట్టు తెలుస్తోంది.
నెల రోజుల్లో చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కూతురు..ఏకంగా తిరిగి రాని లోకాలకే వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





