హైదరాబాద్ అత్తాపూర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరాలం ట్యాంక్ సమీపంలో ఏడేళ్ళ బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడి తలపై రాళ్ళతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారంతో అందుకున్న పోలీసులు బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బాలుడిని తలపై రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని అత్తాపూర్ లోని మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని నెక్లెస్రోడ్డుకు చెందిన మహమ్మద్ రహీమ్గా గుర్తించారు. బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే చుట్టుపక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
Also read
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..
- కర్నూల్లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..





