ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా (65), కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
TG Crime: ఖమ్మం జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు కూడా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో పఠాన్ యూసుఫ్ మియా (65)కి మతిస్థిమితం లేదు. ఇంటి సమీపంలోని ఊర చెరువులోకి దిగాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని గమనించిన కుమారుడు కరీముల్లా తండ్రిని కాపాడుదామని చెరువులోకి దిగాడు.
కాపాడే ప్రయత్నం చేసినా..
అయితే గతంలో చెరువులో ప్రోక్లైన్ల ద్వారా పెద్ద పెద్ద గోతులు తీసి మట్టిని తరలించారు. దీంతో లోతును అర్థం చేసుకోలేక కుమారుడు కూడా తండ్రితో పాటే చనిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత తండ్రీ కుమారుల మృతదేహాలను వెలిసి తీశారు. రంజాన్ పర్వదినాన ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూసుఫ్ మియాకు భార్య ముగ్గురు కొడుకులు. కరీముల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





