తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో జడ్జిపైనే దాడి చేశాడు..
రంగారెడ్డి, ఫిబ్రవరి 13: ఓ కేసులో నిందితుడిగా నిర్ధారనైన వ్యక్తికి కోర్టు తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే తాను నిర్ధోషినని, జడ్జితో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని నిందితుడు కోర్టులో హల్చల్ చేశాడు. ఈ క్రమంలో జడ్జి వద్దకు పరిగెత్తకుంటూ వెళ్లిన నిందితుడు.. ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోక్సో కేసులో నేరస్తుడికి జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో ఆగ్రహానికి గురైన నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ఏకంగా ముద్దాయి చెప్పు విసిరాడు. తీర్పు అనంతరం తన బాధ జడ్జితో చెప్పుకోవాలంటూ జడ్జి వద్దకు పరుగు తీశాడు. అనంతరం తన కాలి చెప్పు తీసి జడ్జిపైకి విసిరాడు.
ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు న్యాయమూర్తిపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో జడ్జిపైకే చెప్పు విసిరాడు. దీంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో షాకైన కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- నేటి జాతకములు…27 ఏప్రిల్, 2026
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!





