రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది.. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేస్తుండగా గుట్ట దగ్గర రెండు మృతదేహాలు కనిపించడంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి.. ఇద్దరినీ.. దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.
మృతుల్లో యువతి, యువకుడు ఉన్నారు. ఇద్దరినీ కత్తులతో పొడిచి.. ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలం నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.
అయితే.. ఘటనా స్థలానికి కొంత దూరంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా..? లేక మరెవరైనా ఇంతటి ఘోరానికి పాల్పడ్డారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూ లను చూసి నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Also read
- నీకేం పోయేకాలంరా.. ఏడేండ్ల చిన్నారిపై 70 ఏండ్ల వృద్ధుడి అత్యాచారం
- TG CRIME: ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి…మరో 70 మంది..
- ఫేక్ డిగ్రీతో అమెరికాకు.. కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత హైదరాబాద్లో అసలు మ్యాటర్ తేలింది..
- టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పెళ్లి బృందంపై కర్రలు, ఇటుకలతో దాడి..
- నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు*