ఇయర్ మారినా కొందరి తీరు మాత్రం మారట్లేదు. కొత్త సంవత్సరంలోనూ కక్కుర్తి వేషాలే వేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ను క్యాష్ చేసుకునేందుకు… జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంకా పలు రెస్టారెంట్లు, హోటళ్లు మారలేదు. కస్టమర్ల సేఫ్టీ పట్టలేదు. న్యూఇయర్ను క్యాష్ చేసుకునే పనిలో మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపించింది.
ఒకవైపు వరుస తనిఖీలతో హోటల్స్.. రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు నిర్వహికులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. సీజ్ చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెస్టారెంట్లు, హోటల్స్ తీరు ఏమాత్రం మారడంలేదు. హైదరాబాద్లో ఎక్కడ తనిఖీలు చేసినా.. అవే కుళ్లిపోయిన పదార్థాలు, కిచెన్స్లో అదే అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తుండడం షాకిస్తోంది. తాజాగా.. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో కొంపల్లిలోని ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాంతో.. కీలక విషయాలు బయటపడ్డాయి.
ఆయా రెస్టారెంట్లలోని కిచెన్స్లో కుళ్లిన పదార్థాలు, బొద్దింకలు కనిపించాయి. నాన్-వెజ్ ఐటమ్స్లో సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. బటర్ అప్లై చేసేందుకు పెయింట్ బ్రష్ వాడుతుండడం చూసి షాకయ్యారు. కుళ్లి కంపు కొడుతున్న టమాటాలు, ఎక్స్పైర్ అయిన పదార్థాలను వంటల్లో వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జిలో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడంతోపాటు.. ఒకే ఫ్రిడ్జ్లో వెజ్, నాన్ వెజ్ను నిల్వ చేస్తుండడపై సీరియస్ అయ్యారు. రెస్టారెంట్లోని కుళ్లిన పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత.. కుళ్లిన పదార్థాలను డస్ట్ బిన్స్లో వేయించి.. ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు
Also Read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





