విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కాకినాడ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకొని అతడికి దేహశుద్ధి. చేశారు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగింది.
గణితం బోధిస్తున్న శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also read
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్గా సెలైన్తో పనికానిచ్చేసింది
- గుర్రంపై స్వారీ.. ‘దేశ గురువు’గా ఎంట్రీ.. గ్రామస్థుల అనుమానాలతో పరార్..!
- అమావాస్య ఎంత పనిచేసింది.. తెల్లారి ముగ్గు చూసి పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. ఇదిగో వీడియో
- మహిళా లెక్చరర్కు అసభ్యకర మెసేజ్లు.. సీన్కట్చేస్తే.. కాంట్రాక్టర్ కుమారుడికి ఊహించని షాక్..





