SGSTV NEWS
CrimeTelangana

Hyderabad News: రూ.కోటి విలువైన స్థలం కబ్జా.. సహకరించిన సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్



స్థలం కబ్జా కేసులో నిందితులకు సహకరించిన సబజిస్ట్రార్ జ్యోతిని అరెస్టు చేసి పోలీసులు మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.


హైదరాబాద్: ఓ ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు.. ఏకంగా ఆ స్థలం యజమాని మృతి చెందినట్లు నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న భారాస మహిళా నేత, మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు సబెజిస్ట్రార్ జ్యోతిని మంగళవారం అరెస్టు చేసి మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఏం జరిగిందంటే?

ఉప్పుగూడ హనుమాన్నగర్కు చెందిన లెండ్యాల సురేశ్ కు   సుభాష్ నగర్ కు -వెంకట్రాద్రినగర్ లో 200 గజాల స్థలం ఉంది.  ఆ స్థలం ఖాళీగా ఉన్నట్లు సుభాష్నగర్కు చెందిన   భారాస మహిళా నేత పద్మజారెడ్డి, అలియాస్  కుత్బుల్లాపూర్ పద్మక్క(32) గుర్తించింది. హయత్నగర్ కు  చెందిన రేపాక కరుణాకర్(34)ను సంప్రదించింది.రూ.3.50 లక్షలు చెల్లించి నకిలీ పత్రాల తయారీకి  ఒప్పందం చేసుకుంది. ఇంటి యజమాని 1992లోనే  మృతిచెందినట్లు మరణ ధ్రువపత్రం సృష్టించారు. Bరవిశంకర్ అనే వ్యక్తిని అతడి కుమారుడిగా సృష్టించారు.  ఆధార్ కేంద్రం ఆపరేటర్ గగనం నరేంద్ర(25)   సహకారంతో హరీశ్ అనే వ్యక్తిని రవిశంకర్ గా  చూపించేందుకు నకిలీ పాన్కార్డు తయారు చేయించారు.  దాంతో ఆధార్ పేరు మార్పులు చేశారు. 2023   ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్ సబ్జెజిస్ట్రార్ కార్యాలయం  అప్పటి అధికారిణి జ్యోతి సాయంతో పద్మజారెడ్డి సోదరి  నాగిరెడ్డి కోమలకుమారికి ఈ స్థలాన్ని రవిశంకర్  విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. స్థలం  యజమాని లెండ్యాల సురేశ్ ఫిర్యాదుతో స్థలం కబ్జా  బాగోతం బయటికొచ్చింది. నిందితుల వద్ద పోలీసులు  నకిలీ పత్రాలు, ల్యాప్టాప్లు, స్కానర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Also read

Related posts

Share this