ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని మనస్తాపంతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది
సంగారెడ్డి: ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని మనస్తాపంతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మాలపహాడ్కు చెందిన రంజిత్ పుల్కల్(20) అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ఆ యువతి పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని తీవ్రంగా కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన రంజిత్.. సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే