అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహాళ్లో సోమవారం రాత్రి రామాంజనేయస్వామి రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పి పి.జగదీష్ ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హనకనహాల్ గ్రామానికి చెందిన వైసిపి మద్దతుదారుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి… పెట్రోల్ పోసి రథానికి నిప్పు అంటించినట్లు విచారణలో తేలింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. గ్రామంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రథానికి నిప్పుపెట్టినట్లు విచారణలో తేలిందని ఎస్పి చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
Also read
- విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్స్టేలో రక్తపు మడుగులో మృతి
- నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!
- Garuda Purana : అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..




