అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహాళ్లో సోమవారం రాత్రి రామాంజనేయస్వామి రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పి పి.జగదీష్ ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హనకనహాల్ గ్రామానికి చెందిన వైసిపి మద్దతుదారుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి… పెట్రోల్ పోసి రథానికి నిప్పు అంటించినట్లు విచారణలో తేలింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. గ్రామంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రథానికి నిప్పుపెట్టినట్లు విచారణలో తేలిందని ఎస్పి చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





