నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది. పంట వేసేందుకు వైకాపా జడ్పీటీసీ భర్త ప్రసాదౌడ్.. కానిస్టేబుల్ రమేశ్కు అప్పు ఇచ్చారు. వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ప్రసాద్ గౌడ్ అప్పు తీర్చాలని రమేశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తాళలేక రమేశ్ మంగళవారం లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 





