హైదరాబాద్ నగరంలోని షేక్పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని షేక్పేటలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీల సందర్భంగా రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ విషయమై ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
షేక్పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటీల సమయంలో బాక్సర్లు, కోచ్లు ఘర్షణకు దిగారు. ఇద్దరు బాక్సర్ల మధ్య మ్యాచ్ సందర్భంగా వివాదం తలెత్తింది. తప్పుడు అంపైరింగ్ చేయడం మూలంగా తాము ఓడిపోయామని ఆరోపిస్తూ ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేందుకు ఇరు వర్గాలు గోల్కొండ పోలీస్స్టేషన్ను వెళ్లాయి.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





